రైల్వే శాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇంట్లో మాదిరిగానే మనకు నచ్చిన ఆహారం తెచ్చుకుని తింటామని, రైళ్లలో కూడా మనకు కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు మంగళవారం ఐఆర్సీటీ, స్విగ్గీ మధ్య ఒప్పందం కుదిరింది. మార్చి 12 నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.వైజాగ్, బెజవాడ, భువనేశ్వర్, బెంగళూరులోని స్టేషన్లలో తొలుత స్విగ్గీ సర్వీసును ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.