యూపీలోని ఝాన్సీ రైల్వే స్టేషన్లో గూడ్స్ రైలు కోచ్ శనివారం బోల్తా పడింది. ప్లాట్ఫారమ్ నంబర్ 8 వద్ద ఈ ఘటన జరిగింది. వెంటనే రైల్వే అధికారులు అక్కడికి చేరుకున్నారు. గూడ్స్ రైలు కోచ్ను తిరిగి పట్టాలెక్కించేందుకు సిబ్బంది పనులు ప్రారంభించారు. ఈ ఘటనతో ఇతర రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.