
BREAKING: ఉద్యోగులకు రేపు రూ.6,200 కోట్ల బకాయిల చెల్లింపులు
AP: సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పారు. శుక్రవారం ఉద్యోగులకు రూ.6,200 కోట్ల CPS, GPF, APGAI బకాయిలు చెల్లించాలని సీఎం ఆర్థిక ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో రేపు వారి ఖాతాల్లో నగదు జమ కానుంది. ఈ క్రమంలో ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జనవరి 11న దాదాపు రూ.1,033 కోట్ల బకాయిలను చెల్లించిన సంగతి తెలిసిందే.