మెదక్ జిల్లా సంగాయిపేట తండాలో వంద శాతం పోలింగ్

73చూసినవారు
మెదక్ జిల్లా సంగాయిపేట తండాలో వంద శాతం పోలింగ్
మెదక్ జిల్లాలోని ఓటర్లు అందరికి ఆదర్శంగా నిలిచారు. కొల్చారం మండలం సంగాయిపేట తండాలో 100 శాతం పోలింగ్ నమోదైంది. 210 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 95 మంది పురుషులు, 115 మంది మహిళలు ఉన్నారు. శత శాతం పోలింగ్ నమోదు కావడంతో తండావాసులను మెదక్ కలెక్టర్ అభినందించారు.