త్వరలోనే.. మీ అందరినీ కలుస్తాను: ఆప్ నేత

73చూసినవారు
త్వరలోనే.. మీ అందరినీ కలుస్తాను: ఆప్ నేత
ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియా జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు లేఖ రాశారు.త్వరలో బయటకు వచ్చి మీ అందరినీ కలుస్తానని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను ఆదుకున్న ప్రతాప్‌గంజ్ నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మనీష్ సిసోడియా తీహార్ జైలు నుంచి ఢిల్లీ ప్రజలకు లేఖ రాయడం ఇది రెండోసారి.