న్యూ ఎస్సీ కాలనీకి బోర్ వేయించిన ప్రభుత్వ విప్
పెగడపల్లి మండల పరిధిలోని నంచర్ల గ్రామంలో ఆదివారం ధర్మపురి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బోర్ వేయించారు. స్థానికులు వేసవిలో త్రాగునీటి సమస్య ఉందని స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి న్యూ ఎస్సీ కాలనీలో బోరు వేయించారు. అనంతరం ప్రభుత్వ విప్ కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.