రోడ్డు అంతా బురదమయం.. ప్రయాణం దుర్భరం

57చూసినవారు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలోని జైహింద్ పూర్ గ్రామానికి వెళ్లే రహదారి వర్షాలకు పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో నిత్యం ఆ దారి గుండా ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. బురదలో నానా తంటాలు పడాల్సి వస్తోందని అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన రోడ్డు నిర్మించాలని గ్రామస్థలు కోరుతున్నారు.