ఎన్టీఆరే రాజకీయ భిక్ష పెట్టారు: అయ్యన్న

78చూసినవారు
ఎన్టీఆరే రాజకీయ భిక్ష పెట్టారు: అయ్యన్న
తాను 25 ఏళ్లకే ఎమ్మెల్యే కావడానికి ఎన్టీఆరే కారణమని ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు అన్నారు. గుంటూరులోని ఎన్టీఆర్ కల్చరల్ అసోషియేషన్ వేడుకలో మాట్లాడుతూ.. ‘‘ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వస్తున్నారంటే ఎంతోమంది విమర్శించారు. కానీ, ఆయన రాజకీయాల్లో రాణిస్తారని 25ఏళ్ల వయసులోనే నేను నమ్మాను. నాకు రాజకీయ భిక్ష పెట్టారు. మహిళలకు ఆస్తిహక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ కల్పించిన గొప్ప వ్యక్తి’’ అని ప్రశంసించారు.

సంబంధిత పోస్ట్