జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ బాలహేశ్వర స్వామి వారి ఆలయాలలో శుక్రవారం నిర్వహించిన వేలం పాట రికార్డ్ స్థాయిలో పలికింది. టెంకాయల వేలం పాట రూ 1. 28 కోట్లకు పోగా, వాహనాల పార్కింగ్ వేలం పాట రూ. 70 లక్షలకు పలికింది. ఈ రెండింటికి వేలం పాట పూర్తయిందని దేవస్థానం ఈవో పురేందర్ కుమార్ తెలిపారు.