నారాయణపేట మైనారిటీ గురుకుల పాఠశాలలో చదివి వంద శాతం మార్కులు సాధించిన ఇంటర్, పదవ తరగతి విద్యార్థులను గురువారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో కలెక్టర్ శ్రీహర్ష అభినందించారు. శాలువతో ఘనంగా సన్మానించారు. మునుముందు మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని చెప్పారు. గురుకులలో ప్రభుత్వం కల్పించిన సదుపాయాలతో విద్యను అభ్యసించాలని చెప్పారు. సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్, సిబ్బంది పాల్గొన్నారు.