ఎర్ర వాగులో చిక్కుకుపోయిన రైతులు

66చూసినవారు
ఎర్ర వాగులో చిక్కుకుపోయిన రైతులు
భీమిని మండలంలో కురిసిన భారీ వర్షానికి తంగళ్ళపల్లి గ్రామ ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించింది. కన్నెపల్లి మండలం బొత్తపల్లి గ్రామానికి చెందిన కూలీలు పత్తి చేలలో పనులకు వచ్చి తిరిగి వెళుతుండగా వారి ట్రాక్టర్ వాగులో వరద ప్రవాహానికి ఇరుక్కుపోయింది. దాంతో వాగులోనే ట్రాక్టర్ వదిలి పలువురు కూలీలు ఒడ్డుకు రాగా మరికొందరు వాగు నీటి ఉధృతికి ట్రాక్టర్ పైనే ఉండిపోయారు. వాగు నీటి ప్రవాహం తగ్గాక బయటికి వచ్చారు.

సంబంధిత పోస్ట్