వైసీపీ ఎంపీ కుమార్తె ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు

75చూసినవారు
వైసీపీ ఎంపీ కుమార్తె ఆక్రమిత స్థలంలో మరోసారి కూల్చివేతలు
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి ఆక్రమిత స్థలంలో అధికారులు మరోసారి కూల్చివేతలు చేపట్టారు. సీఆర్‌జెడ్ నిబంధనల ఉల్లంఘనతో ఉన్న నిర్మాణాల కూల్చివేత చేపడుతున్నట్లు పేర్కొన్నారు. సర్వే నంబర్ 1516, 1517, 1519, 1523లో ఉన్న స్థలంలో కాంక్రీట్ నిర్మాణాలు ఉన్నాయి. సుమారు 4 ఎకరాల స్థలంలో అక్రమ కట్టడాలున్నట్లు జనసేన కార్పొరేటర్ హైకోర్టులో పిల్ వేశారు. కొత్త ఉత్తర్వులతో రెండు వారాల క్రితమే అధికారులు నిర్మాణాలు తొలగింపు చేపట్టారు.

సంబంధిత పోస్ట్