జనసేనకు రూ.5 కోట్లు విరాళం ఇవ్వడంపై చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. "అందరు అధికారంలోకి వచ్చిన తరువాత సాయం చేస్తామంటారు. అధికారం లేకపోయినా, తన సంపాదనని రైతు కూలీల కోసం పవన్ కళ్యాణ్ వినియోగించటం సంతోషాన్ని కలిగించింది. తన స్వార్జితం సమాజం కోసం ఖర్చు పెట్టే మనసున్న తమ్ముడు పవన్ లక్ష్యానికి కొంతైనా ఉపయోగపడుతుందని నేను సైతం జనసేనకి విరాళాన్ని అందించా." అని ఆయన పేర్కొన్నారు.