ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు

69చూసినవారు
ఇంటింటి జ్వర సర్వే చేపట్టాలని అధికారులకు మంత్రి ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రంలో సీజనల్‌ వ్యాధుల నివారణకు సత్వరమే ఇంటింటి జ్వర సర్వేను చేపట్టాలని రాష్ట్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు. మలేరియా, డెంగ్యూను నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే చేపట్టాలని వైద్యాధికారులకు సూచించారు.