వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ 2024 పరీక్ష పేపర్ లీకైనట్లు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోన్న ప్రచారాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఖండించింది. పేపర్ లీక్ ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. ఈ పరీక్షల నిర్వహణలో పారదర్శకత, సమగ్రత విషయంలో రాజీపడబోమని NTA పేర్కొంది.