త్వరలో పట్టాలెక్కనున్న పాతబస్తీ మెట్రో

1051చూసినవారు
త్వరలో పట్టాలెక్కనున్న పాతబస్తీ మెట్రో
ఎంజీబీఎస్-పలక్‌నుమా మార్గం మెట్రో నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కేసీఆర్ మున్సిపల్ శాఖ, ఎల్ అంట్ టీ సంస్థలకు ఆదేశించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తొలి విడత కింద 69.2 కిలో మీటర్ల మెట్రో నిర్మాణ పనులు చేపట్టింది. పాతబస్తీ మార్గంలో ప్రార్థనా మందిరాలు తొలగించాల్సి ఉండటంతో అప్పట్లో మజ్లిస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దాంతో పనులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో 5.5 కి.మీ. నిర్మాణ పనులను చేపట్టి ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మార్గాన్ని పూర్తి చేయనున్నారు.

సంబంధిత పోస్ట్