జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్తో ప్రస్తుత, గత విషయాల గురించి మాట్లాడినట్లు రాహుల్ గాంధీ ట్విటర్ వేదికగా వెల్లడించారు. పుల్వామా దాడి, జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు,
అదానీ వ్యవహారం, 3 సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతుల నిరసన, అగ్నివీర్ వ్యవస్థ వంటి అంశాలపై భేటీలో మాట్లాడినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేశారు.