ఉత్తరప్రదేశ్లోని హథ్రాస్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి దాదాపు 120 మందికి పైగా మృతి చెందినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో మృతులు, బాధితుల కుటుంబాలను పరామర్శించేందుకు విపక్ష నేత రాహుల్ గాంధీ ఘటనా ప్రాంతంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇది దురదృష్టకర ఘటన అని, రాహుల్ హథ్రాస్కు వెళ్లి బాధితులతో మాట్లాడతారని వెల్లడించారు.