ప్రధాని మోదీకి, సుప్రీంకోర్టుకు లేఖ రాస్తా: సజ్జల

79చూసినవారు
ప్రధాని మోదీకి, సుప్రీంకోర్టుకు లేఖ రాస్తా: సజ్జల
తిరుమల లడ్డూ వివాదంపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సమగ్ర విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. టీటీడీ పరీక్షల్లో లడ్డూలో కొవ్వు ఆనవాళ్లు లేవని, ఆవులు తినే ఆహారాన్ని బట్టి పాలల్లో ఆ లక్షణాలు ఉంటాయని తెలిపారు. పాలు, నెయ్యిని ముందుగానే టెస్ట్ చేసి తిరుమలకు పంపుతారని చెప్పారు. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టుకి తాను లేఖ రాస్తానని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్