మహారాష్ట్రలోని పూణేలో బస్సులోనే ఓ మహిళపై యువకుడు అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో నిందితుడు దత్తాత్రయ రాందాస్గా గుర్తించి అతడి ఫొటోను రిలీజ్ చేశారు. అలాగే అతడిని పట్టిస్తే రూ.లక్ష రివార్డు కూడా ప్రకటించారు. నిందితుడి కోసం 13 బృందాలను ఏర్పాటు చేశామని త్వరలోనే అతడిని పట్టుకుంటామని పూణే పోలీసులు తెలిపారు.