సమ్మర్ ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో చక్కెర స్థాయిలు అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ తాగొద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవి శరీరంలో ద్రవాలను కోల్పోయేలా చేస్తాయి. అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. అందుకే ఎండపూట తాగవద్దని చెబుతున్నారు. అలాగే మద్యం, టీ, కాఫీలకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.