మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్లో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. అంగద్ గిరి అనే వ్యక్తి వీధి వ్యాపారి. రోడ్డు పక్కన సరుకులు విక్రయిస్తుంటాడు. అంగద్ రోడ్డు దాటుతుండగా మెరుపు వేగంతో వచ్చిన కారు అతడిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు అంగద్ స్పాట్లోనే చనిపోయాడు. కారు నడిపిన 20 ఏళ్ల వేదాంత్ రాయ్ అనే యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.