ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్.. మరో విద్యార్థిని ఆత్మహత్య

47117చూసినవారు
ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్.. మరో విద్యార్థిని ఆత్మహత్య
రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యానని మనస్తాపం చెంది మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్ గూడకు చెందిన విద్యార్థి (16)ని ఇంట్లో క్షణికావేశంలో ఉరేసుకుంది. దీంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.