లోక్సభ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అభ్యర్థులంతా కొత్త టెక్నాలజీని తమ రాజకీయ ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై.. రోబో (ఏఐ)తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోబోతో ఆమె తమిళ భాషలో మాట్లాడగా పూర్తి వివరాలతో సహా రోబో తమిళ్లో సమాధానం చెబుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.