ప్రధానికి టీమిండియా ‘జెర్సీ’ బహూకరణ

81చూసినవారు
ప్రధానికి టీమిండియా ‘జెర్సీ’ బహూకరణ
భారత క్రికెటర్లతోపాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా ఇవాళ ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధానికి వీరిద్దరూ ప్రత్యేకంగా భారత జెర్సీని అందజేశారు. ఇంగ్లిష్‌లో నమో (NAMO) అని ‘1’వ నంబర్‌తో కూడిన జెర్సీని మోదీకి బహూకరించారు. ఈ ఫొటోలను బీసీసీఐ షేర్ చేస్తూ ‘ప్రధాని అందించిన స్ఫూర్తివంతమైన మాటలను ఆచరణలోకి తీసుకొస్తాం. మీ అమూల్యమైన మద్దతు ఇలానే టీమిండియాపై ఉండాలని కోరుకుంటున్నాం’ అని క్యాప్షన్‌ను జోడించింది.

సంబంధిత పోస్ట్