ఆ మూడు కుటుంబాల చేతుల్లోనే జిల్లా.. అభివృద్ధి శూన్యం: సైదిరెడ్డి

38805చూసినవారు
ఆ మూడు కుటుంబాల చేతుల్లోనే జిల్లా.. అభివృద్ధి శూన్యం: సైదిరెడ్డి
నల్గొండ జిల్లాను మూడు కుటుంబాలు ఏలుతున్నాయని.. కానీ జిల్లా మాత్రం అభివృద్ధి చెందలేదని బిజెపి నల్గొండ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విమర్శించారు. నల్లగొండలో నామినేషన్ వేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుటుంబ పాలన కావాలో.. అభివృద్ధి చేసే మోది కావాలో ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. నల్లగొండ ఎంపీగా తాను భారీ మెజార్టీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :