హైదరాబాద్ మెట్రో మరో మైలురాయిని చేరుకుంది. తాజాగా 50 కోట్ల ప్రయాణికుల మైలురాయిని దాటిందని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. మెట్రోపై ప్రయాణికులకు నమ్మకం పెరిగిందని, మెట్రో ట్రైన్స్ వల్ల 14.5 కోట్ల లీటర్ల ఇంధనం ఆదా అవుతోందని తెలిపారు. రోజూ 5.5 లక్షల మంది ప్రయాణిస్తున్నారని చెప్పారు. రెండో దశ మెట్రో రైలుకు డీపీఆర్లు సిద్ధమయ్యాయని గ్రీన్ మైల్స్ లాయల్టీ క్లబ్ ఆవిష్కరణ సందర్భంగా వెల్లడించారు.