తాజాగా రాజస్థాన్లోని జోధ్పూర్ బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ షెకావత్కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో నటి కంగనా రనౌత్ పాల్గొన్నారు. సంప్రదాయ రాజస్థానీ తలపాగా ధరించి పార్టీ జెండా చేతపట్టి జోధ్పూర్లో మెగా రోడ్ షో నిర్వహించింది. ఈ ర్యాలీ ‘భారత్ మాతాకీ జై..’, ‘జై శ్రీరామ్..’ నినాదాలతో హోరెత్తింది. ఈ సందర్భంగా కంగన మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికే కాషాయ కెరటం ఉప్పొంగుతోంది.. ఇకపైనా ఆ అలలు కొనసాగుతాయి’ అని కంగనా వ్యాఖ్యానించింది.