సెప్టెంబర్ 17వ తేదీని “తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం"గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాలని పేర్కొంది. నైజాం రాష్ట్ర ప్రజలకు 1949, సెప్టెంబర్ 17న నిజాం అరాచక పాలన నుంచి విముక్తి లభించిన సంగతి తెలిసిందే. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రకటించింది. కేంద్రం ఆ రోజును తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహిస్తోంది.