మధ్యప్రదేశ్లోని అమర్పటాన్లో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. మైహార్ సమీపంలోని అమర్పటాన్లో రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని వేగంగా వచ్చిన ట్రక్కు ఢీకొంది. దీంతో లారీ చక్రాల కింద నలిగి ఆ వృద్ధురాలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ట్రక్కు డ్రైవర్ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు లారీ సీజ్ చేసి, డ్రైవర్ను అరెస్ట్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.