అన్నంలో పురుగులు.. విద్యార్థినుల ఆందోళన

1093చూసినవారు
హైదరాబాద్ శివారు గండిమైసమ్మలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ క్యాంపస్ లో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. నిన్న రాత్రి అన్నం, స్వీటులో పురుగులు వచ్చాయని, నాణ్యమైన ఆహారం పెట్టాలంటూ క్యాంపస్ ఆవరణలో నిరసన తెలిపారు. ఒక్కసారిగా విద్యార్థినులంతా క్యాంపస్ అవరణలోకి వచ్చి 'వీ వాంట్ జస్టిస్' అని నినాదాలు చేశారు. ఇదివరకు కూడా అన్నంలో పురుగులు వచ్చాయని, దీనిపై యాజమాన్యం స్పందించాలని స్టూడెంట్స్ ఆందోళనకు దిగారు.