యాదగిరిగుట్ట: 348 మంది దాతలకు ఆహ్వానం

75చూసినవారు
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ స్వర్ణ దివ్య విమాన గోపురానికి మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్స వానికి హాజరుకావాలని 348 మంది దాతలకు ఆహ్వానం పంపినట్లు ఈఓ భాస్కర్రావు బుధ వారం వెల్లడించారు. దివ్య విమాన గోపురానికి బంగారు తాపడం కోసం బంగారం, నగదుతో పాటు చెక్కులను అందజేసిన దాతలందరినీ ఈమహోత్సవానికి ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. 23వ తేదీన నిర్వహించే ఈ వేడుకకు వచ్చే దాతలందరికీ ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్