టీడీపీకి దాసరి రాజామాస్టర్ రాజీనామా..!

"గత 32 సంవత్సరాలుగా టీడీపీలో ఉంటూ పార్టీ అభ్యున్నతికి విశేష కృషిచేసిన టీడీపీ నాయకులు దాసరి రాజా మాస్టర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గుంటూరు బ్రాడీపేటలోని ఎస్హెచ్వోలో రాజామాస్టార్ శుక్రవారం మీడియాతో మాట్లాడారు. 2014 నుండి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని టీడీపీ మోసం చేసినప్పటికీ తాను ఏ నాడు. పార్టీ గురించి వ్యతిరేకంగా మాట్లాడలేదని గుర్తుచేశారు.

అప్పట్లో మహానాడు శిక్షణా తరగతుల్ని విజయవంతం చేసిన ఘనత. తనకు ఉందని ప్రస్తుతం జరుగుతున్న మహానాడులో నైనా చంద్రబాబు మనస్తత్వం మారలేదని దీంతో అసంతృప్తి చెంది పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. ఎన్టీఆర్ హయాంలోనే కష్టపడిన ప్రతీ కార్యకర్తకీ విలువ ఉండేదని, ఆ యన చనిపోవడంతోనే ఆ పార్టీ విలువలు కోల్పోయిందని చెప్పారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో కరోనాతో మరణించిన కార్యకర్తలను కూడా టీడీపీ ఆదుకోకపోవడం తనని ఎంతో బాధించిందని చెప్పారు.

గుంటూరు జిల్లా పార్టీ ఆఫీస్ ని కూడా గాలిలో పెట్టారని. నలభైఏళ్ళ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ పార్టీ కార్యాలయంతో పాటూ కార్యాలయం చుట్టుపక్కల ఉన్న ప్రజల అభివృద్ధికి ఎందుకు కృషి చేయలేకపోయారని ప్రశ్నించారు. త్వరలో పార్టీ మారే అంశం పై సహచరుల తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, ఆ తర్వాత నలుగురికి ఉపయోగపడే మంచి వ్యక్తిగా పనిచేస్తానని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్