కళ్యాణదుర్గం: వాసవి మాతకు స్వర్ణాభిషేకం చేసిన భక్తులు

కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మంగళవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వర్ణాభిషేకం, పంచామృతాభిషేకం వంటి పూజలతో పాటు విభూతి, చెరుకు రసంతో అభిషేకించారు. భక్తులు తరలివచ్చి వాసవి మాతను దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్