రాముని పేరుతో రాజకీయం చేస్తున్నారు

కేంద్రంలో ఉన్న బీజేపీ మత రాజకీయాలు చేస్తూ ముందుకు వెళుతుందని సీపీఎం పార్టీ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు ఆరోపించారు. జనగామ జిల్లా జోఫర్గడ్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న సీపీఎం రాజకీయ శిక్షణ తరగతులకు ఎమ్మెల్యే సాంబశివరావు ఆదివారం హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ పుట్టకముందే రామాయణం ఉందని తెలిపారు. ఇలా రాముని పేరుతో రాజకీయం చేయడం సరికాదన్నారు.