ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఖమ్మంలోని మున్నేరు వాగుకు మళ్లీ వరద ప్రవాహం పెరుగుతోంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే స్థాయి చేరింది. దీంతో మరోసారి భారీ వరదలు వచ్చే అవకాశం ఉండటంతో ఇప్పటికే పలు కాలనీల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. డిప్యూటీ సీఎం భట్టి , మంత్రి పొంగులేటి లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు.