ఏపీలో 301 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. గత మూడు రోజులుగా జరిపిన సోదాల్లో ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 1104 వాహనాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 482 లీటర్ల ఐడీ లిక్కర్, 33.32 లీటర్ల మద్యం, 436 లీటర్ల నాన్- డ్యూటీ లిక్కర్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల కోసం నిర్వహించే కార్డన్ సెర్చ్ కు ప్రజలు సహకరించాలని కోరారు.