కనివిని ఎరుగనిరీతిలో జనప్రవాహంతో అమిలినేని నామినేషన్ ర్యాలీ

1103చూసినవారు
కళ్యాణదుర్గం టిడిపి అభ్యర్థి సురేంద్రబాబు నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. గురువారం ఉదయం 10గంటలకు ప్రారంభమైన భారీ ర్యాలీ ప్రజా వేదిక నుండి మసీదు సర్కిల్ వరకు నిర్వహించారు. అమిలినేని సురేం్రబాబు మాట్లాడుతూ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని చంద్రబాబు పరిపాలనపై నమ్మకంతో ఓటేయాలని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని వర్గాల ఆదరాభిమానాలను చూరగొంటానని భరోసా ఇచ్చారు.