
కళ్యాణదుర్గం: ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలి
ద్విచక్ర వాహనదారులు తప్పక హెల్మెట్ ధరించాలని కళ్యాణదుర్గం రూరల్ సీఐ వంశీకృష్ణ వాహనదారులకు తెలిపారు. బుధవారం సాయంత్రం కళ్యాణదుర్గం బైపాస్ లో రూరల్ సీఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యతను వివరించారు. ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రయాణ సమయంలో హెల్మెట్ ధరించాలని సూచించారు.