భక్తులతో పోటెత్తిన పాండురంగ స్వామి ఆలయం

52చూసినవారు
రాయదుర్గం పట్టణం బళ్లారి రోడ్డులో పాండురంగ స్వామి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. నేడు తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అంతకుముందు ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామి అర్చనానంద ఆధ్వర్యంలో నారాయణుడి సహస్రనామ పారాయణం చేపట్టారు.