![](https://media.getlokalapp.com/cache/0d/42/0d4285ccaea95d023470e473bb7ae9ea.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
తల్లికి వందనం పథకంపై ప్రభుత్వం తక్షణమే స్పష్టతనివ్వాలి
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన తల్లికి వందనం పథకంపై స్పష్టతను ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఆంజనేయులు కోరారు. రాయదుర్గం పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి 2నెలలు కావొస్తోన్నా ఇప్పటివరకు తల్లికి వందనం పథకంపై స్పష్టత ఇవ్వకపోవడం ఏంటంటూ ప్రశ్నించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.