రాయదుర్గంలో 86. 96 శాతం ఓట్లు నమోదు
రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 86. 96 శాతం పోలింగ్ నమోదైంది. నియోజకవర్గంలో 2, 64, 352 మంది ఉండగా 2, 27, 248 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారని తహశీల్దారు చిట్టిబాబు బుధవారం మీడియాకి తెలిపారు. మండలాల వారీగా రాయదుర్గం మండలంలో 88. 61, గుమ్మగట్టలో 88. 50, బొమ్మనహాల్లో 86. 39, డి. హీరేహాల్లో 89. 73, కణేకల్లు మండలంలో 80. 54 శాతం, రాయదుర్గం పట్టణంలో 80. 54 శాతం ఓట్లు పోలయ్యాయి.