మెట్టు ఆధ్వర్యంలోనే వైసిపి మూకలు దాడులకు పాల్పడుతున్నారు

65చూసినవారు
వైసిపి పాలనలో ప్రజాస్వామ్యానికి రక్షణ లేకుండా పోయిందని మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు శుక్రవారం విమర్శించారు. నిన్నటి రోజు వైసిపి నామినేషన్ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తను చితక బాదడం దుర్మార్గమన్నారు. హింసకు తావులేని ఎన్నికలే టిడిపి పార్టీ లక్ష్యం అన్నారు. అందుకనే ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండానామినేషన్ ప్రక్రియ పూర్తిచేసామన్నారు. రాయదుర్గం పట్టణంలో కాల్వ మీడియాతో మాట్లాడారు.