ముప్పై సంవత్సరాల మీ అభిమానానికి కృతజ్ఞతలు

2587చూసినవారు
ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బుధవారం భారీ బహిరంగ సభ నిర్వహించారు. నామినేషన్ అనంతరం జరిగిన ఈ కార్యక్రమానికి టీడీపీ కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ముప్పై సంవత్సరాల మీ అభిమానం, ఆప్యాయతతో ఈ స్థాయికి వచ్చినట్లు కేశవ్ తెలిపారు. 1994లో ఎమ్మెల్యేగా గెలిస్తే అప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిందని, అదే చరిత్రను 2024లో రిపీట్ కావాలని. ఉరవకొండలో జరిగే అభివృద్ధికి మొదటి కూలి తానే అవుతానన్నాడు.