వరద బాధితుల కోసం 10 టన్నుల బియ్యం విరాళం

58చూసినవారు
వరద బాధితుల కోసం 10 టన్నుల బియ్యం విరాళం
విజయవాడ వరద బాధితుల సహాయార్ధం బీసీ సంక్షేమ సంఘం శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు నామాల శంకర్ పది టన్నుల బియ్యం సేకరించారు. ధర్మవరం నుంచి విజయవాడకు తరలిస్తున్న బియ్యం వాహనానికి వన్ టౌన్ సీఐ నాగేంద్ర ప్రసాద్ బుధవారం రాత్రి జెండా ఊపి పంపించారు. విజయవాడకు స్వయంగా వెళ్లి వరద బాధితులకు 25 కిలోల చొప్పున పంపిణీ చేస్తామని నామాల శంకర తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడు బండి వెంకటేశ్, నరసింహులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్