
ఈ నెల 13న ధర్మవరంలో మంత్రి పర్యటన
మంత్రి సత్యకుమార్ యాదవ్ గురువారం ధర్మవరంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ధర్మవరంలోని సీయన్ బి ఫంక్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12: 15 గంటలకు బత్తలపల్లి మండలం పత్యం పురం గ్రామం సీసీ రోడ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని మంత్రి కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు.