మదనపల్లెలో మొక్కులు తీర్చుకున్న కూటమి నాయకులు

75చూసినవారు
ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రాష్ట్రంలో కూటమి విజయం సాధించడంతో మదనపల్లెలో ఆ పార్టీల నాయకులు శనివారం మొక్కులు తీర్చుకున్నారు. పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయం నందు ఎమ్మెల్యే షాజహాన్ భాష తనయుడు జునైద్ అక్బర్, జనసేన పార్టీ నాయకులు శ్రీరామ రామాంజనేయులు తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి పార్టీల శ్రేణులు 1001టెంకాయలు కొట్టారు. రాష్ట్ర అభివృద్ధి వైపే ప్రజలు మొగ్గు చూపారన్నారు.