
రామసముద్రం: "రైతులకు త్వరితగతిన ట్రాన్స్ పార్మర్లు అందజేయండి"
రామసముద్రం విద్యుత్ కార్యాలయం వద్ద శుక్రవారం జడ్పీటీసీ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో రైతులు నిరసన చేపట్టారు. రైతులకు సీరియల్ ప్రకారం ట్రాన్స్ పార్మర్లు ఇవ్వడంలేదని, టమాటా సీజన్ ప్రారంభమైందని, రైతులకు వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ పార్మర్లు అందజేయాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లుగా రైతులు దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారని మండిపడ్డారు.