ఏపీకి తొలి వందే మెట్రో.. ఈ రూట్‌లోనే..!

77చూసినవారు
ఏపీకి తొలి వందే మెట్రో.. ఈ రూట్‌లోనే..!
దేశవ్యాప్తంగా వందేభారత్ రైళ్ల సంఖ్య పెరుగుతోంది. భారతీయ రైల్వే వీటి తయారీపై ఎక్కువగా దృష్టిసారిస్తోంది. ప్రయాణికుల నుంచి రోజురోజుకు ఆదరణ దక్కుతుండటంతో రైల్వే వీటికే అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఏపీకి తొలి వందే మెట్రో రైలు రాబోతోంది. శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం మధ్య ఇది పరుగులు తీయనుంది. దీనికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలంటూ విశాఖపట్నం రైల్వే డివిజన్ అధికారులను కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్