ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం

4506చూసినవారు
ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై  అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం
ఈ నెల 4న రాష్ట్ర ముఖ్యమంత్రి వై. యస్. జగన్ మోహన్ రెడ్డి చిత్తూరు పట్టణానికి వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం పరస్పర సమన్వయంతో పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్ పేర్కొన్నారు. సోమవారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లోని బహిరంగ సభ ప్రాంగణంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్ల పై జిల్లా ఎస్పి వై. రిశాంత్ రెడ్డి తో కలసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు ఎం పి రెడ్డెప్ప, జెడ్ పి చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, ఎం ఎల్ సి తలశీల రఘురాం, జెసి పి. శ్రీనివాసులు, సంబంధింత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. చిత్తూరు అమూల్ డెయిరీ, 300 పడకలతో చీలాపల్లి సిఎంసి ఆసుపత్రి నిర్మాణాలకు భూమి పూజ, శంఖుస్థాపన కార్యక్రమాల కొరకు ముఖ్యమంత్రి చిత్తూరు పట్టణానికి విచ్చేయనున్నారని, గత మూడు రోజుల నుండి పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించడం జరుగుతున్నదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులకు విధులను కేటాయించడం జరిగిందని, అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వర్తించి పర్యటనను విజయవంతం చేయాలని తెలిపారు. బహిరంగ సభకు విచ్చేయు అతిథులు, ప్రజలకు గ్యాలరీల వద్ద ఎటువంటి ఇబ్బంది కలుగకుండా చూడాలని తెలిపారు.