నగరంలో సీఎం పర్యటన నేపథ్యంలో పారిశుద్ధ్యం, రోడ్ల మరమ్మత్తులు, ఇతర పనులు పక్కాగా చేపట్టాలని నగర కమిషనర్ డా. జె అరుణ నగరపాలక అధికారులను ఆదేశించారు. కమిషనర్ శుక్రవారం ఉదయం నగరంలో విస్తృతంగా పర్యటించారు. సీఎం పర్యటించనున్న విజయ డైరీ ప్రాంగణాన్ని కమిషనర్ పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటించే మార్గాల్లో పారిశుద్ధ్య పనులు పక్కాగా చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య పనుల నిర్వహణకు సంబంధించి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసి సమర్పించాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం కమిషనర్ జిల్లా కలెక్టర్ బంగ్లా రోడ్డులో ఇరువైపుల మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంఈ వెంకట ప్రసాద్, ఎంహెచ్వో డా లోకేష్, డీఈ రమణ, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.